ఇటీవలే జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తే ఎవరైనా భయభ్రాంతులకు గురి కావాల్సిందే.మనిషి తన లోపల పగను పెంచుకొని చేసే దారుణాలు ఎంత కిరాతకంగా ఉంటాయో ఈ హత్యను చూస్తే అర్థమవుతుంది.
ఒక నిద్రిస్తున్న వ్యక్తిపై భారీ బండరాయిని మోపితే.ఆ వ్యక్తి తల ఏ స్థితిలోకి మారుతుందో ఊహించుకుంటేనే భయం కలుగుతుంది.
నిజామాబాద్ జిల్లా( Nizamabad )లోని మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాయి మోది దారుణంగా హత్య చేశారు.ఆ హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.న్యాల్కల్ గ్రామానికి చెందిన కట్ట రమేష్ (47)( Katta Ramesh ) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం.అయితే శనివారం రాత్రి రమేష్ గాడ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు రమేష్ తలపై భారీ బండరాయి మోపారు.
దీంతో రమేష్ ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి.వెంటనే ఆ వ్యక్తులు అక్కడినుండి పరారయ్యారు.
ఇక ఆదివారం ఉదయం స్థానికులు రమేష్ మృతదేహాన్ని చూసి వెంటనే మోపాల్ పోలీసులకు( Police ) సమాచారం అందించారు.వెంటనే ఆ ప్రాంతానికి చెందిన సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ మహేష్ లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
శనివారం రమేష్ కు అతని భార్యకు మధ్య గొడవ జరగడం, ఆదివారం తెల్లవారుజామున రమేష్ హత్యకు గురికావడం వెనుక చాలా అనుమానాలు కలుగుతున్నాయి.రమేష్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలోనే హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో బయటకు వస్తుందని పోలీసులు తెలిపారు.