పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు.సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ తో చేసిన హ్యాట్రిక్ మూవీగా వచ్చిన పుష్ప సంచలన విజయం అందుకుంది.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీతో సినిమా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో అట్లీ వరుస క్రేజీ సినిమాలు చేశాడు.
రాజు రాణి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు అట్లీ బాగా పరిచయం.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న అట్లీ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్.
అదే జరిగితే మాత్రం అల్లు అర్జున్ ఖాతాలో మరో సెన్సేషనల్ మూవీ పడినట్టే అని చెప్పొచ్చు.తీసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న అట్లీ షారుఖ్ తో చేసే సినిమా హిట్ అయితే అటు బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది.
అయితే షారుఖ్ సినిమా తర్వాత అట్లీ ఎలాగు పాన్ ఇండియా డైరక్టర్ అవుతాడని భావించి అతనితో సినిమా ప్లాన్ చేస్తున్నడట అల్లు అర్జున్.అట్లీ.
అల్లు అర్జున్ ఈ కాంబో కుదిరితే మాత్రం ఖచ్చితంగా మరో పుష్ప లాంటి సినిమా అల్లు అర్జున్ ఖాతాలో పడినట్టే లెక్క.