గుజరాత్ లో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి.ఈ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు.తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది.25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణ పతాకాన్ని సాధించింది.దీంతో తెలంగాణలో తొలి పతకం వచ్చి చేరింది.ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించింది.దీంతో వెరసి జాతీయ క్రీడల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో రెండు పసిడి పతకాలు ఒకే రోజు చేరాయి.
తాజా వార్తలు