యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం గురించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా, ఇంకా ఈ సినిమా పూర్తి కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తోంది.
తాజాగా ఈ సినిమా నుండి ఓ యంగ్ హీరో వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సోదరుడి పాత్రలో తమిళ నటుడు అథర్వ నటించనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.అయితే ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో, తన డేట్లు అడ్జెస్ట్ చేసుకోవడం వీలు కావడం లేదని ఆయన ఈ చిత్ర యూనిట్కు తేల్చి చెప్పాడట.
అయినా కూడా వారు తమ పంథా మార్చుకోకపోవడంతో అథర్వ ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.దీంతో వెంటనే రాధేశ్యామ్ చిత్ర యూనిట్ అతడి స్థానంలో మరో తమిళ నటుడు జివి ప్రకాష్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి రాధేశ్యామ్ చిత్రం ఆలస్యం అవుతుండటంతో చిత్ర యూనిట్లోని కొందరు సభ్యులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనేది ఈ వార్తతో నిజం అయ్యింది.ఇక ప్రభాస్ విక్రమాధిత్య అనే పాత్రలో వింటేజ్ లుక్లో మనకు కనిపించనున్నాడు.
కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ రాధేశ్యామ్ చిత్రంపై అదిరిపోయే అంచనాలను క్రియిేట్ చేశాయి.
రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.