యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వింటేజ్ లుక్లో కనిపించే ప్రభాస్, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అదిరిపోయే రేంజ్లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ తమిళ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ యంగ్ హీరో అథర్వ ప్రభాస్ తమ్ముడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ ఈ సినిమాలో చాలా వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటంతో, ఆయన తమ్ముడి పాత్రలో నటించేందుకు అథర్వా కూడా వెంటనే ఓకే అన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్కు ముందు జార్జియాలో జరుపుకోగా, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ సినిమా షూటింగ్ను కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.పూర్తి పీరియాడికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా పూర్వజన్మ నేపథ్యంతో సాగుతుందని, ఇందులో ప్రభాస్ పాత్ర చాలా హైలైట్గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.