తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి.పార్టీ కొత్త కమిటీల ఏర్పాటుతో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ఎంపిక చేయడమే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు నచ్చలేదు.
గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు లోకేష్ ఏం చెప్పినా తలూపేవారు… అచ్చెన్న అలా కాదు ఆయన పేరును ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి సూచించినప్పుడే మరొకరు తన పనిలో వేలు పెట్టకూడదని చంద్రబాబు ముందే ఖరాఖండీగా చెప్పేశారు.
లోకేష్ అచ్చెన్నకు పదవి రాకుండా చూసేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు.
అందుకే నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్ పేరును తెరమీదకు తీసుకు వచ్చారు.అయితే బలమైన వాగ్దాటి ఉండడంతో పాటు ఇంత తీవ్ర వ్యతిరేక గాలులను కూడా తట్టుకుని ఎర్రన్న కుటుంబం నుంచి ముగ్గురు విజయం సాధించడం, అచ్చెన్నను వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపడం లాంటి కారణాల నేపథ్యంలో అచ్చెన్నకే ఈ పదవి బాబు కట్టబెట్టారు.
అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆయన ప్రతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులకు ఫోన్లు చేసి పార్టీ పరిస్థితి, కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు.
వైసీపీ నాయకులకు కౌంటర్లు ఇస్తున్నారు.పార్టీలో ప్రతి చోటా గ్రిప్ పెంచుకుంటున్నారు.
బీసీల మద్దతు కూడగడుతున్నారు.ప్రభుత్వాన్ని వీలున్నప్పుడల్లా ఇరుకున పెడుతున్నారు.
ఆయన ఊహించిన దానికంటే దూకుడుగా ముందుకు వెళుతున్నారు.
ఇటు బయట ఫ్లెక్సీల్లో అచ్చెన్న ఫొటోలు పెద్దవి అవుతుంటే.
లోకేష్వి చిన్నవి అవుతున్నాయి.అటు సోషల్ మీడియాలో కూడా టీడీపీ వాళ్లు అచ్చెన్నకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ పరిణామాలు గమనించే లోకేష్ సైతం వ్యక్తిగత ఇమేజ్ కోసమే వరదలు వస్తే మోకాళ్లోతు నీళ్లల్లో దిగారన్న టాక్ ఉంది.అచ్చెన్న ఎవరితోనూ ఘర్షణలు లేకుండా సమన్వయంతో వెళుతున్నారు.
ఈ పరిణామాలతో లోకేష్తో పాటు ఆయన అనుచరుల్లో కాస్త టెన్షన్ నెలకొందనే అంటున్నారు.