కుప్పం మున్సిపల్ పోరులో వైసీపీ తిరుగులేని విజయం సాధించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో.
పాటు స్థానిక జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో కూడా వైసీపీ గెలవడం తోపాటు ఇప్పుడు మున్సిపల్ పోరులో.గెలవటం తో… చంద్రబాబు సీన్ అయిపోయినట్లు.
వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించుకొని వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారు.? అనే విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో ఓడిపోయాక చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకోవాలని అన్నారు.సర్పంచ్, మండల్, మున్సిపల్ మోడీ ఎన్నికలలో కుప్పం ప్రజలు చంద్రబాబుకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు.దీంతో పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.
దమ్ముంటే వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని అప్పుడు గెలిస్తే తెలుగుదేశం పార్టీని రద్దు చేస్తామని సవాల్ విసిరారు.