పవర్ లేని నాయకుడు కంటే పవర్ ఉన్న నాయకుడి మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది.అదే విధంగా బాధ్యత కూడా తీవ్రంగా ఉంటుంది వారికి.
పవర్ చేతిలో ఉంది కదా అని రెచ్చిపోకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అన్నిటినీ మించి అధికారం లో ఉన్న వారి మాటలు ప్రజలు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు.
హద్దు దాటితే ఇంకేం లేదు.తెలివిగా దెబ్బ తీయడం మానేసి ప్రతిపక్షం రెచ్చ గోడితే రెచ్చిపోవడం తెలుగు తమ్ముళ్ళకి బాగా అలవాటు అయిపొయింది.
నోటికి ఒచ్చింది తిట్టేయ్యడం వారి ధోరణి లో కనిపిస్తోంది.
ఎంత అధికారం చేతిలో ఉన్నా ఇలా బిహేవ్ చెయ్యడం ఏంటి అంటూ కోప్పడుతున్నారు కొందరు.
తాజాగా అసంబ్లె లో న్యాయవ్యవస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను డిఫెన్స్ లో పడేసేలా చేశాయి.క్షమాపణ తప్ప మరో మార్గం లేకుండాచేశాయి.
ఒకవేళ.సారీ చెప్పకున్నా.
జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసే పరిస్థితి.ఇలాంటి సమయంలో మైకు తీసుకున్న మంత్రి అచ్చెన్న.
న్యాయవ్యవస్థ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదో టంగ్ స్లిప్ అయ్యి చేయలేదని.ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో నువ్వు మగాడివైతే లాంటి పదాల్ని వినియోగించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.