ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైయస్సార్ ఆసరా పథకం పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.ఒంగోలులో ఈరోజు సీఎం జగన్ రెండో విడత ఆసరా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆసరా పథకం అనేది మోసమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఈ పథకం పేరుతో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి మంది డ్వాక్రా మహిళలకు.
జగన్ కుచ్చుటోపీ పెడుతున్నారని… సెటైర్లు వేశారు.
మొదటి విడత ఆసరా పథకం లో 87 లక్షల మందికి.ఈ పథకం వర్తించగా… ఇప్పుడు 78.76 లక్షల మంది మహిళలకు ఎందుకు తగ్గిపోయిందని మిగిలిన ఎనిమిదిన్నర లక్షల మంది లబ్ధిదారులు… ఏమైపోయారు సీఎం గారు అంటూ అచ్చెన్నాయుడు.నిలదీశారు.రాష్ట్రవ్యాప్తంగా 98 మంది మహిళలు ఉంటే కేవలం 78 లక్షల మందికి ఈ ఆసరా పథకాన్ని వర్తించడం ఏంటి అని ప్రశ్నించారు.అంత మాత్రమే కాక మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు ఒక విడుతను పది విడుతలుగా చేస్తున్నారని… విమర్శల వర్షం కురిపించారు.ఇంకా అనేక రీతులుగా అచ్చం నాయుడు సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.