పొన్నూరు మండలం చింతలపూడి లో టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.సంగం డైరీ లో అవకతవకలు జరిగినట్లు.ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టడానికి ఏసీపీ దూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేయడం జరిగింది.408, 409,418,420, 465, 471, 120-బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం అరెస్టు చేయడం జరిగింది.ఈ పరిణామంతో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అందించారు.ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ అంటూ ఖండించారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీరియస్ అయ్యారు.దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతుంటే .ఏపీలో మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగి రాక్షసానందం పొందుతోంది అని పేర్కొన్నారు.రాష్ట్రంలో కరోనా కట్టడి చేయటంపై దృష్టి పెట్టకుండా .అక్రమ కేసులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.రాష్ట్రంలో కావాలని సంగం డైరీ ని దెబ్బ కొట్టడానికి.అమూల్ ని.ప్రభుత్వం రంగంలోకి దింపింది అని ఆరోపించారు.ఏది ఏమైనా దేశం క్లిష్ట సమయంలో ఉన్న టైమ్లో ఈ విధంగా ప్రత్యర్ధులపై కేసులు పెట్టి అరెస్టు చేయటం దారుణమని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం పై మండి పడుతున్నారు.