అమెరికన్ తెలంగాణా అసోసియేషన్ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నికుంది.ఇటీవల అమెరికా లోని డెట్రాయిట్ లో జరిగిన బోర్డు మీటింగ్ లో పాల్గొని ఆటా చైర్మన్ గా మాధవరం కరుణాకార్,అధ్యక్షుడి గా వినోద్ కుమార్ లను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.
అలానే ఈ సమావేశంలో భాగంగా 25 అంశాలపై 8 గంటల పాటు చర్చలు జరిపారు.ఇక నుంచి అమెరికన్ తెలంగాణా అసోసియేషన్ ను క్లుప్తంగా ‘ఆటా తెలంగాణా’ గా పిలవాలంటూ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నట్లు సమాచారాం.
ఇక నుంచి ‘ఆటా తెలంగాణా’ గానే ప్రజల్లో కి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించుకుంది.అలానే ఆటా సంఘం భవిష్యత్తు లో నిర్వహించబోయే కార్యకలాపాలను వెల్లడించారు ఆటా నూతన అధ్యక్షులు వినోద్ గారు.
నూతన కార్యవర్గం జూన్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు పనిచేస్తుందని చెప్పారు.తదుపరి సమావేశం సెప్టెంబర్ 7న ఫ్లోరిడాలో జరుగుతుందని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో బోర్డు పూర్వపు ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల కూడా హాజరై ఆయన పదవి లో ఉండగా చేపట్టిన సేవా కార్యక్రమాలను బోర్డు నూతన సభ్యులకు వివరించారు.