తమిళచిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ధనుష్.ఆయన సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడు అయినప్పటికీ కూడా ధనుష్ సొంత ప్రతిభ తోనే ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.
అయితే తాజాగా ధనుష్ మరోసారి అసురన్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వెక్కై అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేసిన టీం తాజాగా మరో పోస్టర్ విడుదల చేసింది.ఇందులో ధనుష్ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది.
మంచి మాస్ లుక్లో పవర్ఫుల్గా కనిపిస్తున్న ధనుష్ ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.అలానే ఈ చిత్ర ట్రైలర్ని సెప్టెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అలానే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండగా,కథానాయికగా మలయాళ భామ మంజు వారియర్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి ఈ చిత్రం మాత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.మరి మారి-2 తరువాత ధనుష్ చేస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.