కృష్ణబిలం ఈ పేరు దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం వింటున్నాం.శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ కృష్ణ బిలం గురించి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసారు.
అలాగే ఈ కృష్ణ బిలం ఎలా ఉంటుంది అనే విషయాలపై కూడా ఊహాచిత్రాలతో కొంత చెప్పే ప్రయత్నం జరిగింది.అయితే ఈ కృష్ణ ఇలాలు సౌర కుటుంబంలో, అంతరిక్షంలో ఉన్నాయని, వీటి ద్వారా జీవ వినాశనం జరిగుతుందని, కొత్త సృష్టి ఏర్పడుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
కాని వీటిని ఎప్పుడు ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు.
అయితే అమెరికాకి చెందిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా టెలిస్కోప్ లో తొలిసారి గా కృష్ణ బిలం చిత్రాలు బుధవారం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేశాయి.
బ్లాక్ హోల్ లేదా కృష్ణ బిలం గురించి దశాబ్దాలుగా వింటున్న నిజాలకి ఇప్పుడు ప్రత్యక్ష నిరూపణ కనిపించింది.ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచం ముందు నాసా ఆవిష్కరించింది.
భూమికి 55 మిలియన్ కాంతిసం వత్సరాల దూరంలో ఈవెంట్ హోరైజైన్ టెలిస్కోప్ ఈ బ్లాక్ హోల్ చిత్రాన్ని క్లిక్ మనిపించింది.మొత్తానికి ఈ దృశ్యాలు చూడటం ద్వారా అసలు కృష్ణ బిలం ఎలా ఉంటుంది అనే దానిపై ప్రపంచంలో ప్రజలకి క్లారిటీ వచ్చింది అని చెప్పాలి.