ప్రముఖ సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ).ఈయన మొదట సమంత( Samantha ) నాగచైతన్య ( Nagachaitanya ) పెళ్లి చేసుకునే సమయంలోనే వారిద్దరు విడిపోతారని చెప్పారు ఆ సమయంలో ఈయన చెప్పిన విషయం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే చివరికి వేణు స్వామి చెప్పినదే నిజం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.కేవలం సమంత నాగచైతన్య విషయంలోనే కాకుండా రామ్ చరణ్ ఉపాసన దంపతులు చాలా ఆలస్యంగా తల్లిదండ్రులు కాబోతారని కూడా గతంలో తెలియజేశారు.
ఈ విధంగా వేణు స్వామి చెప్పినవన్నీ కూడా ఆలస్యంగా నిజం అవుతూ రావడంతో చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది అయితే 2023వ సంవత్సరంలో ప్రభాస్ ( Prabhas ) జాతకం గురించి ఈయన చెప్పారు.ప్రభాస్ జాతకం చాలా ఘోరంగా ఉండబోతుందని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో చనిపోతారంటూ వేణు స్వామి చెప్పారు.ఈయన చెప్పిన విధంగానే తారకరత్న( Tarakaratna ) మరణించడంతో అందరూ వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని భావించారు.
ఈయన ఫలానా హీరో చనిపోతారని చెప్పకపోయినా టాలీవుడ్ హీరో అని చెప్పడంతో అది తారకరత్న గురించి చెప్పారని అందరూ భావించారు.అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చెప్పారు.అయితే ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.జూన్ 9వ తేదీ వీరిద్దరి నిశ్చితార్థం ( Engagement ) ఎంతో ఘనంగా జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి విషయంలో వేణు స్వామి చెప్పిన మాటల్లో నిజమయ్యాయా ఆయన జోస్యం మరోసారి నిజమైందా అంటూ పలువురు ఈయన చెప్పిన వ్యాఖ్యలపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.