ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెర పడింది.విడిపోతారు అన్న ఊహాగానాలు నిజమయ్యాయి.
తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అక్కినేని ఫ్యామిలీ నుంచి దూరం అవుతున్నట్లు సమంతా వెల్లడించింది.
అయితే ఈ జంట విడాకుల గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తొలి నాటి నుంచి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.వీరి చాలా కాలం కలిసి ఉండలేదని ఆయన చెప్తూనే ఉన్నాడు.
వీరు ఎన్నిరోజులైనా విడిపోతారని బల్ల గుద్ది మరీ వెల్లడించాడు.ఆయన మాటలు తాజాగా వాస్తవం అయ్యాయి.
వీరి పెళ్లి గురించే కాదు.నాగచైతన్య తమ్ముడి గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆయన పెళ్లి వ్యవహారం నిశ్చితార్థం వరకే వచ్చి ఆగుతుందని వెల్లడించాడు.అనుకున్నట్లుగానే అఖిల్ పెళ్లి ముచ్చట.
ఎంగేజ్ మెంట్ తోనే ఫుల్ స్టాప్ పడింది.
తాజాగా మరోసారి వేణు స్వామి సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై స్పందించాడు.
తాను నాలుగేళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు నిజమైందన్నాడు.వాళ్ల జాతకం ప్రకారం కలిసి ఉండే యోగం లేదని చెప్పాడు.
దోష నివారణ పూజలు చేసినా ఫలితం లేదన్నాడు.వీరే కాదు.
వీరి తమ్ముడి పరిస్థితి కూడా ఇంతే అన్నాడు.నిశ్చితార్థం అయినా.
పెళ్లి కాదని తేల్చి చెప్పాడు.అదే వాస్తవం అయ్యింది.
సమంతా, నాగచైతన్య పెళ్లి జరిపేటప్పుడే వీరి జాతకాలు కుదరవని చెప్పినట్లు వెల్లడించాడు.అయినా పట్టించుకోకుండా పెళ్లి చేశారని చెప్పాడు.
ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అటు ఈ విడాకులు వ్యవహారం తర్వాత జరగబోయే పరిణామాల గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.సమంతాతో విడిపోయిన తర్వాత నాగచ చైతన్య కెరీర్ మరింత బాగుంటుందని వెల్లడించాడు.ఆయన జాతకం ప్రకారం తన దశ తిరిగిపోతుందన్నారు.
అటు సమంతా పరిస్థితి మాత్రం మరింత దిగజారిపోయే అవకాశం ఉందన్నాడు.ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య.
ఇక ముందు అంతే వేగంగా ముందుకు సాగుతాడని వెల్లడించాడు.