ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వ తారీకు నుండి నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అయింది.జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ఆమోదం కానుంది.అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.20వ తారీకు జరగబోయే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నరట.
సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం.రాష్ట్రంలో కరోనా వైరస్….విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ అధికారులు .ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే ఈ ఏడాది తొలి నెలలకు సంబంధించి అంచనా లెక్కల ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటం జరిగింది. అంతే కాకుండా జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కి.మండలిలో చల్లా రామకృష్ణారెడ్డి లకు సంతాపం ప్రకటించాలని అసెంబ్లీ కమిటీ డిసైడ్ అయింది.