సాధారణంగా ప్రతి రోజూ మన దినచర్యను వేడివేడి టీ తో ప్రారంభిస్తారు.టీ తాగడం వల్ల ఆ రోజంతా ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా పను చేసుకోగలుగుతారు.
అలాంటి టీ పొడి సాధారణంగా కిలో 500 దాకా ఉంటుంది.కానీ మీరు ఎప్పుడైనా కేజీ టీ పొడిధర 75,000 ఉండటం చూశారా? అవును మీరు చదివినది నిజమే! కేజీ టీ పొడి ధర అక్షరాల 75,000 రూపాయలు అంత ధర పలికే ఆ టీ పొడి స్పెషల్ ఏమిటో? అయితే ఈ టీ పొడి అంత ఖరీదికి ఎక్కడ అమ్మడుపోయిందో తెలుసుకుందాం.
ఇంత ఖరీదైన టీ పొడిని గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (GTAC) ఇటీవల ప్రత్యేకమైన టీ పొడి కోసం నిర్వహించింది.అయితే ఈ టీ పొడిని కొనుక్కోవడానికి వివిధ ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి.
ఒక సంస్థకు మించి మరొక సంస్థ వేలంపాటలో పోటీ పడటంతో చివరకు కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సమస్త ఈ టీ పొడి ని కిలో 75000 తో వేలం పాడి ఈ టీ పొడిని సొంతం చేసుకున్నట్లు GTABA సెక్రటరీ దినేష్ బిహని ఓ ప్రకటనలో తెలియజేశారు.
కరోనా సమయంలో ప్రతి ఒక్క ఉత్పత్తులు డీలా పడ్డాయి.
కానీ, ఈ టీ మాత్రం ఎంతో ధరలు పలుకుతూ లాభాల బాటలో పడ్డాయి.కరోనా సమయంలో ఎక్కువగా ఈ టీ సేవించడం ద్వారా ఇంత ఆదరణకు నోచుకుంది.
ఇంతటి ప్రత్యేకమైన టీ ఉత్పత్తుల కోసం దిబ్రూగడ్లోని మనోహరీ టీ ఎస్టేట్ గత నెలలో తీవ్రంగా శ్రమించారని సెక్రెటరీ దినేష్ బీహని తెలిపారు.
ఇంత ధర పలికే ఈ టీ ప్రాముఖ్యత ఏమిటంటే ఈ టీ మొగ్గలను ఉదయం సూర్యకిరణాలు ప్రసరించక ముందే కోయడం ద్వారా ఎంతో సువాసనభరితంగా కలిగి టీ కి అద్భుతమైన రుచిని కలిగిస్తాయి.
అంతేకాకుండా ప్రతి రోజు ఈ టీ తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా ఈ సందర్భంగా తెలిపారు.అందువల్ల ఈ టీ పొడికి ఇంత డిమాండ్ ఉందని, గతంలో కూడా ఈ టీ పొడి ధర కిలో 50,000 వరకు పలికిందని ఆయన తెలిపారు.