ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప‘.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.ఇక మొదటి పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరుతొ డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక లుక్ రివీల్ అయ్యింది.ఇద్దరు కూడా మాస్ గా కనిపించి అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ చిత్రం నుండి విడుదల అయినా పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కో పాట ఒక్కో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.ఇవన్నీ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.
ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలెట్ గా నిల్వ బోతున్నాయి.
ఇక ఈ సినిమా విడుదలకు కొద్దిగా మాత్రమే సమయం ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది.తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
తమిళనాడు థియేట్రికల్ హక్కులు లైకా ప్రొడక్షన్స్ 6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.ఇక మలయాళ రైట్స్ ను ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే పుష్ప విడుదల చేయనున్న అన్ని భాషల్లో శాటిలైట్ డీల్ ముగిసింది.మరి చూడాలి అల్లు అర్జున్ మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.