బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ఇతర భాషల ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 సెట్ పనులు జరుగుతుండగా కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైందని వార్తలు వస్తున్నాయి.
అయితే బిగ్ బాస్ సీజన్ 5లో టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పాల్గొనబోతున్నారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి సీజన్ లో ఒక హీరో ఉండేలా జాగ్రత్త పడతారనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, నాని, నాగార్జున ఈ షోను హోస్ట్ చేయగా బిగ్ బాస్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి హోస్ట్ లు కూడా కారణమని చెప్పవచ్చు.బిగ్ బాస్ సీజన్ 5పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
గత సీజన్లు హిట్ కావడంతో బిగ్ బాస్ షోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వచ్చే నెలలో ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కరోనా పరిస్థితుల వల్ల వరుసగా రెండో ఏడాది కూడా బిగ్ బాస్ షో ఆలస్యంగా ప్రారంభం కానుండటం గమనార్హం.జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు చేసి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారని సమాచారం.
ఈ సిజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి పలువురి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు బిగ్ బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన ఓంకార్ చక్రం తిప్పడం వల్లే అశ్విన్ బాబుకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.అశ్విన్ కు నటుడిగా మంచి పేరు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.బిగ్ బాస్ షో ద్వారా అశ్విన్ జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది.