టాలీవుడ్లో తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో నాగశౌర్య, రీసెంట్గా అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు రమణ తేజ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ మూవీగా నిలిచింది.వెండితెరపై ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
దీంతో ఈ సినిమా రిజల్ట్తో నాగశౌర్య తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కాగా ఈ సినిమాను బుల్లితెర ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.ఈ సినిమాను మొదటిసారి టీవీలో టెలికాస్ట్ చేయగా 9.10 టీఆర్పీ రేటింగ్ రాగా, రెండోసారి 5.41 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది.ఇక మూడోసారి ఈ సినిమా ప్రసారమైనప్పుడు 5.61 టీఆర్పీ రేటింగ్ రావడంతో ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాకు బుల్లితెరపై ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని తాము అస్సలు ఊహించలేదని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమా కోసం నాగశౌర్య తనను తాను మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే.కాగా ఈ సినిమాకు కథను కూడా ఆయనే స్వయంగా రాసుకోవడం విశేషం.
అందాల భామ మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జిషు సేన్గుప్తా విలన్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు.మొత్తానికి అశ్వద్ధామ చిత్రం వెండితెరపై బొక్కబోర్లా పడినా, బుల్లితెరపై మాత్రం దుమ్ములేపిందని చెప్పాలి.
ఇక ప్రస్తుతం నాగశౌర్య ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం శౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో అల్ట్రా స్లిమ్గా కనిపించనున్నాడు.
సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.