ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కామెడీ షోల హవా కొనసాగుతోంది.బుల్లితెరపై కామెడీ ప్రధానంగా చేస్తున్న షోలు సక్సెస్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.
జబర్దస్త్ షోకు పోటీగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ షోలో రవి చేసే స్కిట్లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
కామెడీ స్టార్స్ షో ప్రోమోలకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి.
ఎక్స్ ప్రెస్ హరి, అషురెడ్డి జంటగా ప్రతి వారం స్కిట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే యాంకర్ రవి వీళ్ల స్కిట్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.ఎక్స్ ప్రెస్ హరి అమ్రేష్ పురి రోల్ వేయగా స్కిట్ లో భాగంగా హరి రా బాలికా అని పిలవగా లాస్య పరుగెత్తుకుంటూ వస్తారు.
అయితే లాస్యతో పాటు అషురెడ్డి కూడా వస్తుంది.ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డితో నిన్ను కాదు బాలిక నేను ఆ బాలికను పిలిచాను అని చెబుతాడు.
ఎక్స్ ప్రెస్ హరి అలా అనడంతో ఇంకోసారి పిలిస్తె నేను రాను చెబుతున్నా అంటూ అషురెడ్డి ఎక్స్ ప్రెస్ హరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు.ఆ తరువాత రవి అషురెడ్డి మెడను రవి గట్టిగా పట్టుకుని వెళ్లిపో అంటూ మాంత్రికుడి గెటప్ లో ఉన్న ఎక్స్ ప్రెస్ హరిని బెదిరిస్తాడు.ఎక్స్ ప్రెస్ హరి నిమ్మకాయ పిండేస్తానని చెబితే రివర్స్ లో రవి బ్లాక్ మెయిల్ చేయడంతో ఎక్స్ ప్రెస్ హరి చనిపోతాడు.
ఈ ఆదివారం మధ్యాహ్నం 1 : 30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.జబర్దస్త్ షోకు ఈ షో గట్టి పోటీని ఇస్తుందనే చెప్పాలి.ఈ షో ప్రసారమయ్యే సమయంలో ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ప్రసారమవుతుండగా ఆ షో కంటే కామెడీ స్టార్స్ షోకే ఎక్కువగా ఆదరణ దక్కుతోంది.