ఈ మధ్య కాలంలో బుల్లితెర ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో అషురెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే.
బుల్లితెర సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి కామెడీ స్టార్స్ షోతో పాటు హ్యాపీ డేస్ షో చేస్తున్నారు.ఈ రెండు షోలు అషురెడ్డికి మంచి పేరును తెచ్చిపెట్టడం గమనార్హం.
గ్లామరస్, హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అషురెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న అషురెడ్డి కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
పార్టీలు, ట్రిప్ లు, ఇతర విషయాలకు సంబంధించిన వీడియోలను అషురెడ్డి అభిమానులతో పంచుకుంటూ ఉండటం గమనార్హం.మరోవైపు పటాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొందరు కమెడియన్లు కామెడీ స్టార్స్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఎక్స్ ప్రెస్ హరి, బిందాస్ భాస్కర్ నడిరోడ్డులో కొట్టుకోగా సద్దాం హుస్సేన్ వాళ్లు కొట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలొ షేర్ చేశారు.సద్దాం మూడు రెడ్ బుల్ బాటిళ్లను కొనుగోలు చేశామని ఒకటి తాను, యాదమ్మ రాజు తీసుకున్నామని మూడో బాటిల్ కోసం హరి, భాస్కర్ కొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు.అయితే ఈ వీడియోను చూసిన అషురెడ్డి కమెడియన్ల పరువు తీసేలా కామెంట్లు చేశారు.
అషురెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వీడియో షేర్ చేయడంతో పాటు రెడ్ బుల్ కొరకు ఫైట్ చేసుకోవడం ఏమిటి చీప్ గా అంటూ కామెంట్లు చేశారు.అషురెడ్డి కామెంట్ ను చూసి నెటిజన్లు అషురెడ్డి చెప్పిన మాటలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు.పబ్లిక్ లో పరువు పోయేలా ప్రవర్తించిన కమెడియన్లను సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.