అషు రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర పై ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతో సందడి చేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం బుల్లితెరపై కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది.ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక కామెడీ స్టార్స్ వేదికపై అషు రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి చేసే స్కిట్ గురించి నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం హరి తన గుండెలపై అషు రెడ్డి పచ్చబొట్టు వేయించుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం అషు రెడ్డి ఎక్స్ ప్రెస్ హరికి ఎంతో విలువైన బైక్ కొనివ్వడంతో హరి తనని హగ్ చేసుకొని ఎంతో ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అషు రెడ్డి మాట్లాడుతూ అది నీకు ఎంత అవసరమో నాకు తెలుసు అంటూ ఎమోషనల్ అవుతూ వీరిద్దరూ కలిసి ఆ బైక్ పై షికార్లు కొట్టినట్లు తెలుస్తోంది.
అషు రెడ్డి కామెడీ స్టార్ట్ కార్యక్రమం నిర్మాత పూజ అనంత్ తో ఎంతో క్లోజ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే పూజా ఆనంత్ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేయడంతో ఈమెకు తన గురించి కన్నా అషు రెడ్డి గురించి నెటిజన్లు ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అషు రెడ్డి లో ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటని ఆమెను ప్రశ్నించారు.ఈ క్రమంలోనే పూజ అనంత్ ఆమె ఇప్పుడు కూడా ఫోన్ వాడుతూ ఉంటుందని తనలో ఉన్నటువంటి ఒక అలవాటు గురించి తెలియజేశారు.
ఈ విషయంపై అషు రెడ్డి స్పందిస్తూ… ఎక్స్ప్రెస్ మొహాలను చూడటం కంటే ఫోన్ చూడటం ఎంతో బెటర్ అంటూ చెప్పుకొచ్చింది.