బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న తర్వాత అషు రెడ్డి క్రేజ్ బాగా పాపులర్ అయ్యింది.సోషల్ మీడియాలో అషు రెడ్డి ఎంత దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.
ఇక ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను తీసి నెట్టింట్లో తెగ షేర్ చేస్తుంది.మొత్తానికి అషు రెడ్డి ఓ సెలబ్రిటీ గా పేరు సంపాదించుకుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాతే బుల్లితెరపై పరిచయం అయింది.ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది.
చూడటానికి సమంత లా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.అతి తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది.ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమా లో ఒక పాత్రలో నటించింది.
ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.
అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.ఆ మధ్య ఆయన తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.
ఆయనతో నటించాలని కోరిక కూడా ఉందని తెలిపింది.ఈమధ్య మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజా పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న సినిమాలో నటించగా ఆయనతో దిగిన ఫోటో షేర్ చేసింది.
ఇది చూసిన అషు హిమజా పై ఈర్ష ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.తాజాగా అషు ఆనందంతో తొందరలో ఓ తప్పు చేసింది.
అసలేం జరిగిందంటే.
ఇక తాజాగా అషు పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు, ఆయన ఇచ్చిన లేఖను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.మొదటిసారి అయనను కలువగా ఆయన టీ తాగమని ఆఫర్ చేశారని పైగా రెండు గంటలసేపు ముచ్చట పెట్టుకున్నామని తెలిపింది.ఎంతో హాయిగా అనిపించిందని, ఎంతో సంతోషంగా ఉందని తాను వెళ్లేముందు ఓ లెటర్ ను కూడా ఇచ్చాడని తెలిపింది.
ఈ విషయం గురించి అభిమానులతో పంచుకుంటూ అషు ఓ పొరపాటు చేసింది.ఆమె నేరుగా డైరెక్టర్ క్రిష్ కు ధన్యవాదాలు తెలిపింది.ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటంటే.
డైరెక్టర్ క్రిష్ ఇన్ స్టాగ్రామ్ ఖాతానే లేదు.ఆనందం తట్టుకోలేక క్రిష్ పేరుతో ఉన్న ఓ ఖాతాను ట్యాగ్ చేసింది.
అంతేకాకుండా అది ఫేక్ ఖాతా అని తెలియని కొందరు ఫాలో కూడా అయ్యారట.ఇక ఈ విషయం క్రిష్ వద్దకు చేరగా.
క్రిష్ అషు కి చెప్పడంతో తన తప్పును సరిదిద్దుకుంది.ఇక ఆమె క్రిష్ పేరును తొలగించింది.
ఆయనకు ఇన్స్టా లేదంటూ ఆయనను ఎవరు ఫాలో అవ్వకండని తెలిపింది.ఇది ఆయన పర్సనల్ రిక్వెస్ట్ అని పోస్ట్ చేసింది.