నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత ఒక చోట నిలకడగా ఉండక తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిన సమంత తాజాగా తన స్నేహితురాలు సాధన సింగ్, డిజైనర్ ప్రీతమ్ తో కలిసి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆదివారం జరిగే మ్యాచ్ కోసం సమంత దుబాయ్ కి వెళ్ళింది అనే సమాచారం వినబడుతుంది.ఈ క్రమంలోనే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక పెయింటింగ్ వేస్తున్నటువంటి ఫోటోలు షేర్ చేస్తూ అందులో ఒక విషయం దాగి ఉందని అభిమానులకు తెలియజేశారు.ఈ క్రమంలోనే సమంత తెలియజేస్తూ మీ మనసు మీతో పెయింటింగ్ వేయలేదని చెబితే మీకు పెయింటింగ్ వేయాలి అనిపిస్తుంది అప్పుడు వెంటనే లోపల అనుకున్న మాటలు ఆగిపోతాయి.
తాజాగా తాను ఒక పెయింటింగ్ వేశానని పెయింటింగ్ వేసినటువంటి ఫోటోలు షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటో పై పలువురు సెలబ్రిటీలు స్పందించారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోపై విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి స్పందిస్తూ ఇక స్వేచ్ఛగా ఆ పని చేసుకో సామ్ అంటూ కామెంట్ చేశారు.అలాగే మంచు లక్ష్మీ స్పందిస్తూ ఇంత హ్యాపీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కామెంట్ చేయగా… మాళవికా నాయర్ స్పందిస్తూ ఈ మహారాణిని ఎవరు ఆపలేరని కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.