రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా రాజస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులపై సోనియాగాంధీకి కాంగ్రెస్ పరిశీలకుల బృందం నివేదిక అందించింది.
ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధిష్టానం క్లీన్ చిట్ ఇచ్చింది.అదేవిధంగా పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.