టీడీపీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యారు.ఇటీవల జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరు కావటంతో పెద్ద చర్చకు దారి తీసింది.
పరిషత్ ఎన్నికలకి సంబంధించి పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతిరాజు రాకపోవటంతో భిన్న వాదనలు వినబడుతున్నాయి.ముఖ్యంగా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నిర్ణయించుకోవడంతో .అటువంటి నిర్ణయం పార్టీకి డ్యామేజ్ చేయడం గ్యారెంటీ అని అశోక్ గజపతిరాజు అంటున్నారట.
ఎన్నికలు బహిష్కరిస్తే ప్రజలలో పార్టీ చులకన భావం కి గురవుతుందని.ఈ విషయాన్ని ఇటీవల కిందిస్థాయి కార్యకర్తల వద్ద అశోక్ గజపతిరాజు తన అభిప్రాయాన్ని వెల్లడించే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.
తొలిరోజే పరిషత్ ఎన్నికలకు సంబంధించి.ఎస్ఈసీ కార్యదర్శితో సిబ్బందితో చర్చించి .అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.అంతే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం కానుంది.
ఈ క్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించగా.అశోక్ గజపతిరాజు గైర్హాజర్ కావడంతో పార్టీలో ఆయన పెద్ద చర్చనీయాంశంగా మారింది.