ఈ మధ్య హీరోయిన్స్ ఎక్కడపడితే అక్కడ ఫోటో షూట్ లంటూ అభిమానులను తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు.చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ఓ రేంజ్ లో ఫోటోలను షూట్ చేయించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో సినీ నటి ఏకంగా రోడ్డుపై ఫోటో తీయించుకోగా.ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.
కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో 2018లో తెరకెక్కిన సినిమా నాటకం.
ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నటి అషిమా నర్వాల్.ఇక ఈ సినిమాలో ఆశిష్ గాంధీ హీరోగా నటించాడు.తొలిసారి నటనతో అంత క్రేజ్ అందుకోలేదు అషిమా నర్వాల్.ఈమె మోడల్ రంగంలో మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా గా టైటిల్ ను గెలుచుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలో కూడా నటించింది.
2019లో తమిళంలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అందులో హరర్ మూవీ లో నటించగా అంత సక్సెస్ అందుకోలేదు.
ఆ తర్వాత విజయ్ ఆంటోని తో కలిసి ఓ సినిమాలో నటించగా ఆ సినిమా డబ్బింగ్ ద్వారా తెలుగు లో విడుదలైంది.ఇక ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందించింది.ఈ ఏడాది పిట్టకథలు సినిమాలో నటించింది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
తన సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.ఇక తాజాగా ఫోటో షూట్ చేయించుకున్న ఈ బ్యూటీ ఏకంగా రోడ్డుపైనే ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.హ్యాపీ సింబల్ తో ఉన్న బ్లాక్ మినీ స్కర్ట్ ధరించి ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.
అంతేకాకుండా మరో ఫోటో షేర్ చేయగా అందులో ఎంజాయ్ ది జర్నీ అంటూ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటించగా త్వరలోనే విడుదల కానుంది.