దేశంలో కులమతాల వాదనలు మిన్నంటాయి.ఒక పక్క హిందుత్వ వాదులు తమకు తోచిన విధంగా తమ మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే.
మరో పక్క క్రైస్తవ మతం వారు సైతం తమకు తోచిన విధంగా మిగిలిన మతాలను ఆకర్చించి తమ మతంలో చేర్చుకుంటూ తమ బలాన్ని పెంచుకునే విధానంతో ముందుకు పోతున్నారు.ఇక మరో పక్క ఈ మత ప్రస్తావనకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఇది మరింత రచ్చగా మారి ఎటు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఎమ్ఐఎమ్ నేత అసదుద్ధీన్ ఒవైసీ చేస్తున్న వ్యాఖ్యలు మరో ఎత్తు.ఈ ప్రపంచంలో వేరే మతాలు ఏవీ లేవని.
ఈ ప్రపంచంలో పుట్టిన వారందరూ ముస్లింలేనని ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఆ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి.మత వాదులు, వివిద పార్టీల నేతలు అందరూ ఆయన్నే టార్గెట్ చేస్తూ విమర్శల జల్లు కురిపించారు.
అయితే ఇక్కడితో అంతా అయిపోతే బాగానే ఉండేది అసలు సమస్య ఏమిటంటే తన మాటలపై వెనక్కు తగ్గేదే లేదు అని అంటున్నాడు ఒవైసీ.తాను ముందు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఒవైసీ స్పష్టం చేశాడు.
ఈ క్రమంలోనే ఆయన మరో వివాదానికీ తెరలేపాడు.ఈ ప్రపంచంలో పుట్టిన వారంతా ముస్లింలే.
తల్లిదండ్రులు, సమాజమే వారిని ఇతర మతాల్లోకి కన్ వర్ట్ చేస్తున్నాయి అంటూ మరింత మత మంట రాజేసాడు.అంతేకాకుండా తను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యా చేయలేదని.
తనుఎవరినీ క్షమాపణలు కోరేది ఉండదని ఒవైసీ స్పష్టం చేస్తున్నాడు.మరి ఎవరికి వారు ఇలా మతపరమైన మాటలు చెప్పుకుంటూ పోతుంటే చివరకు ఈ సమాజం ఏమయిపోతుందో అన్న భయం ఒకటి సామాన్యుడిలో నెలకొంది.