ఆద్యాత్మిక ముసుగులో అరాచకాలు చేసే స్వామీజీలు భాగోతాలు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటిగా బయటకి వస్తుంది.ఆ మధ్య డేరా బాబా, తరువాత ఆశారాం బాపు అరాచాకాలు బయటపడటంతో పాటు కోర్ట్ లో కూడా వారు దోషులుగా తేలడంతో న్యాయస్థానం వారికి శిక్షలు ఖరారు చేసాయి.
దీంతో ఇప్పుడు వారు జైలు జీవితం గడుపుతున్నారు.అయితే ఇప్పుడు మరో వ్యక్తికి సూరత్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది.
ప్రముఖ ఆద్యాత్మిక వేత్త ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయికి సూరత్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది.
అత్యాచార ఆరోపణలతో వారి భక్తురాలు 2013లో సాయి మీద కేసు నమోదు చేసింది.
సాధిక’ (శిష్యురాలు)లయిన ధర్మిష్ట అలియాస్ గంగ, భావన అలియాస్ జమున; ‘సాధక్ అయిన పవన్ అలియాస్ హనుమాన్లను కూడా దోషులని శుక్రవారం కోర్టు ప్రకటించింది.అత్యాచార కుట్రలో వారు అందరూ భాగస్వాములయ్యారని తెలిపింది.
మహిళలను అక్రమంగా బంధించడంతోపాటు సాయితో సంబంధం నెరిపేలా వారిపై ఒత్తిడి తెచ్చేవారని తేలింది.సాయి కారు డ్రైవర్ రాజ్కుమార్ అలియాస్ రమేష్ మల్హోత్రా కూడా సెక్షన్ 212 ప్రకారం దోషేనని ప్రకటించింది.
దీంతో తండ్రి వెనకాలే ఇప్పుడు కొడుకు కూడా జైలు జీవితానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది.