తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.ఈ రెండు పార్టీల నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే.
భగ్గుమనే పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీపై తాజాగా ఎంఐఎం సెటైర్ వేసింది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.మరి నాకు కూడా ఆవులు ఇస్తారా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.ఒక వేళ నాకు ఆవులను ఇస్తే గౌరవంగా చూసుకుంటానని ఓవైసీ హామీనిచ్చారు.
తాజా వార్తలు