ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసారు.ఏపీలో తెలుగు దేశం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ తరుపున ఏపీలో ప్రచారానికి త్వరలో రాబోతున్నా అని, దమ్ముంటే కాచుకోవాలని ఒవైసీ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్న తమని చాలా మంది విమర్శించారని, అయితే మా నిర్ణయంలో ఎంత కచ్చితంగా ఉంటుందో ఎన్నికల తర్వాత అందరికి అర్ధమైంది అని ఒవైసీ అన్నారు.
అలాగే త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, వైసీపీ పార్టీకి ముస్లిం వర్గాల నుంచి మద్దతు కూడగట్టే విధంగా ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తా అని ఒవైసీ చెప్పుకొచ్చారు.
అలాగే పుల్వామా దాడిలో ఇంటలిజెన్స్ వైఫల్యం వుందని, ఇస్లాం పేరుతో జరిగే టెర్రరిస్ట్ దాడులకి తాము పూర్తిగా వ్యతిరేకంగా అని ఒవైసీ అన్నారు.అలాగే వింగ్ కమాండర్ అభినందన్ చూపించిన తెగువ భారతీయులందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.