ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.ఆర్ ఎస్ ఎస్ సంస్థలో ముస్లిం విభాగం కి సంబంధించి ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
హిందువులు అని చెప్పి ఇతర మతస్తుల పై దేశంలో దాడులు చేసే వారు.అసలు హిందూ కాదని పేర్కొనటం జరిగింది.
ఇతర మతస్తులను గౌరవించని వారు.కూడా ఆ కోవకే చెందుతారు అని మోహన్ భగవత్ అన్నారు.
ముఖ్యంగా గోవుల పేర్లు చెప్పి దాడులు చేసే వారు .కూడా హిందువులు కాదని స్పష్టం చేశారు.అయితే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ కామెంట్లు చేశారు.
దేశంలో గో రక్షక పేరుతో ఎంతోమంది ముస్లింలపై.దాడులు జరిగాయని పేర్కొన్నారు.ముక దాడులకు పాల్పడుతున్న వారికి కేంద్రమంత్రులు సహకరిస్తున్నారని.
అసదుద్దీన్ ఆరోపించారు.దేశంలో మూక దాడులకు కారణం ముమ్మాటికి ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులే అని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో గోవధ సీరియస్ టాపిక్ గా మారుతోంది.తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
గోవధ కు వ్యతిరేకంగా.తెలంగాణ ప్రభుత్వం చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అదే రీతిలో గో రక్షకులు పై దాడులు జరుగుతున్నాయని అరికట్టాలని తెలిపారు.