ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ ను జిల్లా చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.వికారాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
తెలంగాణ ఏర్పడకుండా ఉంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు.జిల్లాకు మెడికల్, డిగ్రీ కాలేజీలున్నాయన్న కేసీఆర్.
కర్ణాటక, ఏపీ కంటే ఇక్కడ భూమి ధరలు పెరిగాయని తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు.
రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నామని తెలిపారు.తెలంగాణలో పల్లెలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోందని ఆరోపించారు.ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెబుతోంది.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.