టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.సినిమాసినిమాకు గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ ఏడాది సమ్మర్ లో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదల కానుండగా సెకండాఫ్ లో సలార్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ రాముడిగా నటించబోతున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు నెలలో విడుదల కానుంది.
ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తాడని పురాణ పాత్రలను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగాఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.దర్శకునిగా నాగ్ అశ్విన్ కు మంచి పేరు ఉండటంతో ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాలని అశ్వనీదత్ భావిస్తున్నారు.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ కేవలం నాలుగు నెలలలో పూర్తి కానుండగా ఈ సినిమా షూటింగ్ తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఆర్య పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆర్యనే ప్రభాస్ సినిమాలో కూడా విలన్ గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.