తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో రసవత్తరంగా మారుతున్నాయి.తాజాగా వై.
ఎస్.షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా సంచలనం లేపిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ఒక్కో రాజకీయ పార్టీ నాయకులు ఒక్కో విధంగా స్పందించారు.జగన్ వదిలిన బాణం అని ఒకరు వ్యాఖ్యానించగా మరల ఆంధ్రాపాలన తీసుక వద్దామని కొందరు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ షర్మిల పార్టీపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.షర్మిల పార్టీ అనేది హలాలూయా పార్టీ అని, దానితో తెలంగాణకు ఒరిగేది ఏమీ ఉండదని, రాజన్న రాజ్యం కాదు కావలసింది రామ రాజ్యమని ఎంపీ ధర్మపురి వ్యాఖ్యానించారు.
అరవింద్ వ్యాఖ్యలపై షర్మిల తరపున ఏ నాయకులు స్పందించకపోయినా అరవింద్ వ్యాఖ్యలతో మరొక్క సారి రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పవచ్చు.షర్మిల పార్టీ రాకపోతే ఇంత రాజకీయ వేడి రాజుకుంటున్నదంటే ఇక పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించాక ఇక ఆ పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగి మరి వారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, లేక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారో అనేటటువంటిది చూడాల్సి ఉంది.