తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈ.వీ.వీ సత్యనారాయణ 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన “ఆరుగురు ప్రతివ్రతలు” అనే చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే ఉంటుంది.ఇందులో భాగంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తుంటాయి.
కాగా ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, ఎల్.బి.శ్రీరామ్ చలపతిరావు రవివర్మ అజయ్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “అమృత” ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.
అయితే ఈ చిత్రంలో నటించిన తర్వాత అమృత తెలుగు చిత్రాలలో నటించలేదు.దీనికి తోడు ఈ అమ్మడు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటి కావడంతో కన్నడలో సినిమా అవకాశాలు బాగానే తలుపు తట్టాయి.
దీంతో అమృత మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమ వైపు రావడమే పూర్తిగా మానేసింది.కాగా ఆ మధ్య అమెరికాలో ఇద్దరు తెలుగు దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాల్లో ఈ అమ్మడి పేరు కూడా వినిపించడంతో అప్పటి నుంచీ సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమైంది.
కాగా అమృత తెలుగు, కన్నడ, తదితర భాషలలో కలిపి ఏడు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కాగా ప్రస్తుతం అమృత తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ ఒక్క సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుని అనుకోకుండా సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులలో అమృత మిగిలిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.