తెలుగు సినీ నటుడు, ఆర్ట్ డైరెక్టర్ మరియు డెరెక్టర్ క్రిష్ణ మాయ, ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గురించి, అప్పటి ఈశ్వర్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తి కర విషయాలను ఆయన పంచుకున్నారు.ఈశ్వర్ సినిమా షూటింగ్ అంతా దాదాపు దూల్ పేటలో జరిగిందని ఆయన అన్నారు.
ఖాళీ సమయంలో అభి, ప్రభాస్, తాను దూల్పేటలో అప్పుడప్పుడు తిరిగే వాళ్లమని ఆయన అన్నారు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే తన తొలి సినిమాకు దాదాపు5లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుని ఉంటారని ఆయన అన్నారు.
అసలు ఆయన ఆ సమయంలో కేవలం షూటింగ్పైనా, నటనపైనే దృష్టి పెట్టేవారని క్రిష్ణ మాయ తెలిపారు.షూటింగ్ సమయంలో తామంతా వేరే అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉంటే తాను మాత్రం సైలెంట్గా ఉండే వారని ఆయన అన్నారు.
అంతేగాకుండా అలా చేయొద్దని, అలా చేస్తే బాడీ షేప్ మారిపోతుందని ప్రభాస్ చెప్తుండేవారని క్రిష్ణ మాయ నవ్వుతూ చెప్పారు.
ఇలా ప్రభాస్ తన మొదటి సినిమాకి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ నేడు ఒక్క సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారు.ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ గురించి కృష్ణ మాయ తనతో, తనకున్న అనుభవాలను పంచుకున్నారు.