సినిమా ఇండస్ట్రీలో స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరనే సంగతి తెలిసిందే.ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా పని చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఆనంద్ సాయి మంచి స్నేహితుడు కూడా కావడం గమనార్హం.పవన్ సినిమాల ద్వారా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోక ముందు నుంచే పవన్ కు ఆనంద్ సాయికి మంచి స్నేహం ఉంది.
తాజాగా ఆనంద సాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ రూమ్ లో ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ఉంటాయని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ అధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి ఆ విధంగా పవన్ తనకు కనెక్ట్ అయ్యారని ఆనంద్ సాయి చెప్పుకొచ్చారు.తాను పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని ఆనంద్ సాయి అన్నారు.
తన పెళ్లికి డబ్బులు అవసరమైన సమయంలో పవన్ కళ్యాణ్ సహాయం చేశారని అయితే ఆ డబ్బులు రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తే పవన్ డబ్బులు తీసుకోలేదని ఆనంద్ సాయి చెప్పుకొచ్చారు.పవన్ తనకు మంచి స్నేహితుడని బాగా సపోర్ట్ చేస్తారని ఆనంద్ సాయి ఆన్నారు.
పవన్ తో కలిసి బైక్ లో బస్ లో కలిసి తిరిగానని ఆనంద్ సాయి పేర్కొన్నారు.చిరంజీవి భార్య సురేఖ పవన్ ను తల్లిలా చూసుకునేవారని ఆనంద్ సాయి వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ ఇంటికి ఏదైనా కారణం వల్ల ఇంటికి లేట్ గా వస్తే సురేఖ మనుషుల్ని పెట్టి వెతికించేవారని అంతగా పవన్ విషయంలో టెన్షన్ పడేవారని ఆనంద్ సాయి పేర్కొన్నారు.హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు.