ఈ మధ్య సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక పెళ్లి వీడియోలు దర్శన మిస్తూనే ఉంటున్నాయి.పెళ్ళిలో ఏ చిన్న విషయం జరిగిన అది నెట్టింట వైరల్ అవ్వడం కామన్ అయి పోయింది.
అయితే ఈ వీడియోల్లో కొన్ని ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని కామెడీగా ఉంటున్నాయి.ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.
ఇలాంటి వీడియోలను నెటిజెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా పెళ్ళిలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోతారు.ఒక జంట చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.ఇంతకీ వీళ్ళు ఏం చేసి ఉంటారా.అని ఆలోచిస్తున్నారా.
వీళ్ళు పెళ్ళికి పిలిచే అతిధులు తెచ్చే గిఫ్ట్ ల కాస్ట్ లను బట్టి విందును ఏర్పాటు చేసారు.దీనికి సంబంధించిన కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎవరైనా పెళ్ళికి మనస్ఫూర్తిగా అతిధులను ఆహ్వానిస్తారు.
కానీ వీళ్ళు మాత్రం పెళ్ళికి పిలిచినట్లే పిలిచి ఖరీదును బట్టి విందు భోజనం ఏర్పాటు చేసారు.ఇందుకు నాలుగు క్యాటగిరీలు కూడా చేసారు.ప్రేమ పూర్వక గిఫ్ట్, బంగారు గిఫ్ట్, వెండి గిఫ్ట్, ప్లాటినం గిఫ్ట్ అంటూ పేర్లు పెట్టి వాటిని బట్టి ఫుడ్ కూడా రెడీ చేయించారు.250 డాలర్ల విలువ కలిగిన బహుమతి తెస్తే ప్రేమ పూర్వక బహుమతిగా భావించి వారికీ రోస్ట్ చికెన్ లేదా ఫిష్ ను వడ్డిస్తారట.
అదే 250 నుండి 500 డాలర్ల మధ్య గిఫ్ట్ తెచ్చే వారిని వెండి గిఫ్ట్ గా భావించి వారికీ మొదటి క్యాటగిరీ లో ఉన్న వంటలు లేదా సల్మాన్ ను ఎంపిక చేసుకోండి అని తెలిపారు.
ఇక 501 నుండి 1000 డాలర్ల మధ్య గిఫ్ట్ విలువ ఉంటే వారిని బంగారు గిఫ్ట్ గా భావించి ఫస్ట్ అండ్ సెకండ్ క్యాటగిరీ వంటలు కలిపి వడ్డిస్తారట.ఇక చివరిగా ప్లాటినం గిఫ్ట్ కింద 1000 నుండి 2500 డాలర్ల మధ్య గిఫ్ట్ తెచ్చిన వారికీ మొదటి క్యాటగిరీ వంటలు వడ్డిస్తారట.
ఇదంతా ఒక కార్డు లో ప్రింట్ చేసి అతిధులకు పంపించారు.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.