రిపబ్లికన్ టీవి అధినేత అర్నాబ్ గో స్వామి ఈ మధ్య కాలంలో టిఆర్పి స్కామ్ లో అడ్డంగా బుక్కైనా సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ఆయన జైలుకు కూడా వెళ్ళాడు.
ఆ తర్వాత ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించి బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు.అర్నాబ్ గో స్వామి న్యూస్ రిపోర్టర్ గా మొదట కెరీర్ ను ప్రారంబించాడు.
ఆయన తో డిబేట్ అంటే రాజకీయనాయకులకు చెమటలు పడుతాయి.డిబేట్ మధ్యలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాదనం చెప్పలేక వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు.
సూటిగా ప్రశ్నించే తత్వం అర్నాబ్ ది.టిఆర్పి స్కామ్ లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వెమెంట్ ఉందని అర్నాబ్ మొదటి నుండి వాదిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉంటూ వస్తుంది.ఎందుకు అంటే సరైన ఆధారాలు లేకుంటే ఎవరిని మాత్రం అరెస్టు చేయగలం.తాజాగా పోలీసు స్టేషన్ నుండి అర్నాబ్ చాట్ లీక్ అయ్యింది.ఈ విషయం వెనుక ఆయన అంటే పడని ఎవరో కచ్చితంగా ఉన్నారని తెలుస్తుంది.
ఆర్నాబ్ గోస్వామి.బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీక్ అయ్యాయి.ఇవ్వని ఒక్కటో రెండో పేజీలు కాదు.80 ఎంబి సైజ్ ఉన్న మెసేజ్ లు లీక్ అయ్యాయి.ఆ మెసేజ్ చాటింగ్ లు పరిశీలిస్తే ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేవిదంగా ఉన్నాయని తెలుస్తుంది..