ఆ పని మేము స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు.. కాంగ్రెస్‌, బీజేపీ పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఫైర్.. ?

రాజకీయ పార్టీలన్నాక ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకోవడానికే చూస్తారన్న విషయం ప్రతి వారికి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రతిపక్షం వారిని ఆడిపోసుకోవడం షరా మామూలే.

 Armur Trs Mla, Jeevan Reddy, Congress, Bjp, Bandi Sanjay-TeluguStop.com

ఇలాంటి మాటల యుద్ధాలకు మన రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న పార్టీలకు పెట్టింది పేరు.

ఇలా ఒకరినొకరు తిట్టిపోసుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామనే విషయం కూడా గుర్తుకు రానంతగా ప్రవర్తించడం మన రాజకీయ నాయకులకే చెల్లిందట.

ఇక ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు స్టువర్ట్ పురం దొంగలు, వారంతా గాడ్సే వారసులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బిజేపీ ఎంపీ బండి సంజయ్ ని ఉద్దేశించి మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఊరుకుంటున్న మమ్మల్ని చేతకాని వారనుకుంటున్నావా, మా సీఎం ఆదేశిస్తే, మేము తిట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు.

అంటూ సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారట.

ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ నేటితరం గాంధీ అని కొనియాడటం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసిందట.

అంతే కాదు గాంధీజీకి వేల కోట్ల ఆస్తులు లేవు, కానీ మీ సీయంకు ఆస్తులు లక్షల కోట్లల్లో ఉన్నాయి ఏంటని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube