RRR సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయనున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.అసలైతే మగధీర తరువాతే మహేష్ తో జక్కన్న వర్క్ చేయాలనీ అనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు.
ఇక వచ్చే ఏడాది రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లతో RRR అయిపోగానే సూపర్ స్టార్ తో డేట్స్ ఫిక్స్ చేసుకోవాలని దర్శకధీరుడు ప్లాన్ వేస్తున్నాడట.
అందుకోసం బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆ ఇద్దరు దగ్గరవ్వడానికి బ్రిడ్జ్ కడుతోంది.ఇక ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆ సినిమా అయిపోయిన తరువాత తన 27వ సినిమా ఎవరితో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు.
క్యూలో పరశురామ్ – సందీప్ వంగ లాంటి దర్శకులు ఉన్నారు.వారితో సినిమాను నిర్మించేందుకు గీత ఆర్ట్స్ – మైత్రి మూవీ మేకర్స్ సపోర్ట్ గా ఉన్నారు.
కానీ వారిని ధాటి ఆర్కా మీడియా రాజమౌళిని మహేష్ ని కలపాలని చూస్తోంది.సరిలేరు నీకెవ్వరు జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఆ తరువాత నెల రోజులు మహేష్ హాలిడేస్ కి ఎక్కడికైనా వెళతాడు.అనంతరం నాలుగు నెలలు వెయిట్ చేస్తే రాజమౌళి ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది.
మరి అప్పటి వరకు మహేష్ వెయిట్ చేస్తాడా లేక ఆ యువ దర్శకుల్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారా? అనేది వేచి చూడాలి.