మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ వేసవిలోనే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
ఇక థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.కాగా రవితేజ తన నెక్ట్స్ చిత్రం ‘ఖిలాడి’ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గతంలో రవితేజతో ‘వీర’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ వర్మ, ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ‘ఖిలాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్లో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా స్టైలిష్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ విలన్ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ను ఎంపిక చేసిందట చిత్ర యూనిట్.అయితే ఇప్పటికే హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో అర్జున్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో మరోసారి స్టైలిష్ విలన్గా అర్జున్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, అను ఇమ్మాన్యుయెల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రమేశ్ వర్మ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా డైరెక్ట్ చేస్తున్న ‘ఖిలాడి’ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి ఖిలాడి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.