తెలుగు సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చూడరు అంటూ ఒకప్పుడు టాక్.కాని అది అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మారిపోయింది.
మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.అర్జున్ రెడ్డి మళ్లీ మళ్లీ ప్రేక్షకులు చూశారు.
అది మాత్రమే కాకుండా ఆ జోనర్ లో వచ్చిన సినిమాలు ఆ స్టైల్ లో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు వదిలి పెట్టకుండా చూస్తున్నారు.తెలుగు సినిమాకు మహారాజ పోషకులు అయిన యూత్ ఆడియన్స్ ఇలాంటి సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తిని కనబర్చుతున్నారు.
అర్జున్ రెడ్డి చూపించిన దారిలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.కొన్ని సక్సెస్ అవ్వగా మరికొన్ని సినిమాలు నిరాశపర్చుతున్నాయి.ఇలాంటి సమయంలో అర్జున్ రెడ్డి సినిమాను మళ్లీ విడుదల చేస్తే ఎలా ఉంటుందా అంటూ దర్శకుడు సందీప్ వంగ చర్చలు జరుపుతున్నాడట.సినిమాకు సెన్సార్ కట్స్ చాలా చెప్పారు.
ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా సీన్స్ కట్ చేసి సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.ఇప్పుడు ఓటీటీలు వచ్చిన కారణంగా సందీప్ వంగ కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అర్జున్ రెడ్డి సినిమాను మళ్లీ అదే కంటెంట్ తో కాకుండా ఎడిట్ చేసి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే విధంగా చర్చలు జరుగుతున్నాయట.ఈ విషయంలో ఆయనకు చాలా మంది మద్దతు కూడా తెలుపుతున్నారు.2022వ సంవత్సరంలో అర్జున్ రెడ్డి సినిమాను ఓటీటీలో రీ ఎడిట్ వర్షన్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుందట.
మొత్తం మూడు గంటలకు పైగా సినిమా ఉంటుందని లెక్కకు మించి రొమాంటిక్ సీన్స్ ఉంటాయని అంటున్నారు.అదే నిజం అయితే అర్జున్ రెడ్డి మళ్లీ సక్సెస్ ఖాయం.