అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ షాలిని పాండే మొదటి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసింది.ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో కూడా జీవించేయడంతో తెలుగులో ఆమెకి అవకాశాలు పుష్కలంగా వస్తాయని అందరూ భావించారు.
అయితే దానికి విరుద్ధంగా పెద్దగా అవకాశాలు రాలేదు.ఏదో ఒకటి అర సినిమాలు చేస్తూ వస్తుంది.
ఇక తాజాగా రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఇద్దరి లోకం ఒకటే అని సినిమా వచ్చింది.ఇది కూడా అటకెక్కింది.
దీంతో సౌత్ లలో అవకాశాలు రావడమే గగనం అయిపోయాయి.
ఇలాంటి టైంలో బాలీవుడ్ నుంచి అనుకోని పిలుపు వచ్చింది.
అక్కడ ప్రస్తుతం క్రేజీ స్టార్ హీరోగా ఉన్న రణవీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం సొంతం చేసుకుంది.ఇక ఏమాత్రం ఆలోచించకుండా ముంబై చెక్కేసింది.
పనిలో పనిగా ఆ సినిమాతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ కి కూడా ఒకే చెప్పింది.బమ్ ఫడ్ అనే వెబ్ సిరీస్ లో ఆమె హీరోయిన్ గా కనిపించనుంది.
త్వరలో ఈ వెబ్ సిరీస్ లో జీ5లో టెలికాస్ట్ కాబోతుంది.రణవీర్ సినిమా, ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఇక ఈ అమ్మడు రేంజ్ బాలీవుడ్ లో మారిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.
మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.
.