పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఈ లోపు వరసపెట్టి సినిమాలు చేయాలనీ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్లు కనబడుతుంది.
ఈ మధ్యనే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసాడు పవన్.
అయితే ఈ సినిమా తర్వాత పవన్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తర్వాత చిత్ర షూటింగ్ ప్రారంభించాడు.
పవన్ కళ్యాణ్ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసిన పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు.
ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి లాయర్ షబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో పవన్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తుంటే.పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.అయితే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.
పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడట.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో ఆయన నటిస్తున్నాడట.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.మరొక హీరోయిన్ జాక్విలీన్ ఫెర్నాండజ్ అర్జున్ రాంపాల్ సోదరిగా నటిస్తుంది.
హైద్రాబాదులో 12 రోజులపాటు ఈ చిత్ర షూటింగ్ జరుగబోతున్నట్లు తెలుస్తుంది.
చార్మినార్, మచిలీపట్టణం పోర్టు సెట్లను షూటింగ్ కోసం ప్రత్యేకంగా వేశారు.ఈ భారీ సెట్లలో పవన్ కళ్యాణ్, అర్జున్ రాంపాల్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సంవత్సరం మీ కల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనీ పవన్, క్రిష్ ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారట.