పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, తన నెక్ట్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమాను ఇప్పటికే లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, త్వరలో షూటింగ్ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా ఓ పీరియాడికల్ కథగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమాలో పవన్ రాబిన్హుడ్ తరహా పాత్రలో నటిస్తాడని, అది చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో పవన్ను ఢీకొట్టేందుకు విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా అంతే పవర్ఫుల్గా ఉండటంతో, తనదైన యాక్టింగ్ స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జున్ రాంపాల్ అయితే ఈ సినిమాకు బాగా సెట్ అవుతాడని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో వారు అర్జున్ రాంపాల్ను విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు, వెంటనే అతడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మరి పవన్ను కొడతానంటోన్న ఈ విలన్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.