పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమా షూటింగ్ లు పెట్టుకున్నాడు.అందులో ఒకటి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ.
ఇప్పటికే ఏకే రీమేక్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబందించిన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.
అతను ఇచ్చిన కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసి క్రిష్ సినిమా కోసం జాయిన్ అవుతాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే క్రిష్ కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.
పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు షూట్ చేసుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఖరారు చేశారు.
ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఔరంగజేబు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం.
ఔరంగజేబు అంటే మన చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.ఆ పాత్రని నెగిటివ్ యాంగిల్ లోనే చరిత్రలో రిప్రజెంట్ చేశారు.
ఈ నేపధ్యంలో సినిమా కథ మొఘలాయిల కాలంనాటిది అని తెలుస్తుంది.ఇక మొఘలాయిల కాలంలో వారి దురాగతాలకు ఎదురుతిరిగిన గిరిజన నాయకుడుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమాకి ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే వీరమల్లు అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.వీరమల్లు టైటిల్ అనేది చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయడానికి ఇదే పెర్ఫెక్ట్ అని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి కూడా ఇలాంటి జానపద కథానాయకులు పాత్రలు అంటే ప్రత్యేక ఇష్టం ఉండటంతో ఆ టైటిల్ వైపే మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.