నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నితిన్ కెరియర్ లో చాలా కాలం తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
నితిన్ కెరియర్ లో అఆ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.రొమాంటిక్ లవ్ స్టొరీతో పాటు అగ్రికల్చర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా కంటెంట్ ప్రెజెంట్ జెనరేషన్ ని భాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.
అలాగే యూనివర్శల్ కాన్సెప్ట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.హిందీలో కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా బాలీవుడ్ కి వెళ్తున్నాయి.అదే దారిలో ఈ సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు ఉండటంతో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన వెంకి కుడుములకి అప్పగించాలని కరణ్ జోహార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా కూడా చాలా మంది నటులని అనుకున్న ఫైనల్ గా అర్జున్ కపూర్ తో చేయడానికి డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
అర్జున్ కపూర్ కూడా ఈ సినిమా చూసి నటించడానికి ఒకే చెప్పినట్లు సమాచారం.ఇక లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా రీమేక్ పై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.